CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డి.వై.చంద్రచూడ్‌

తిరుమల శ్రీవారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (CJI DY Chandrachud) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ సింగ్‌తో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్ దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. డి.వై చంద్రచూడ్ దంపతులకు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Published : 27 Mar 2024 12:57 IST

తిరుమల శ్రీవారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (CJI DY Chandrachud) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ సింగ్‌తో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్ దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. డి.వై చంద్రచూడ్ దంపతులకు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని