CM Revanth: కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. తూకానికి వేయాల్సిందే: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

Published : 19 Apr 2024 16:48 IST

షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు.. అది పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌ (KCR) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్ రెడ్డి.. అందుకోసం పార్లమెంట్, సుప్రీంకోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని