Crime News: ఒడిశాలోని కార్గోషిప్‌లో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

ఒడిశాలోని పారాదీప్ నౌకాశ్రయం (Odisha Paradip Port)లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నౌకాశ్రయంలో లంగరు వేసిన ఓ కార్గో షిప్‌లో రూ.220 కోట్ల విలువ చేసే కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పనామాలో రిజిస్టర్ అయిన ఓ సరకు రవాణా నౌక ఈజిప్టు నుంచి ఇండోనేషియా మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుందని అధికారులు తెలిపారు. పారాదీప్ నుంచి స్టీల్ ప్లేట్లతో నౌక డెన్మార్క్‌కు బయలుదేరాల్సి ఉండగా, ఓడలోని క్రేన్‌లో అనుమానాస్పదంగా ఉన్న 22 ప్యాకెట్లను ఆపరేటర్ గుర్తించి తమకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షల తర్వాత అది కొకైన్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు.

Published : 02 Dec 2023 12:48 IST

ఒడిశాలోని పారాదీప్ నౌకాశ్రయం (Odisha Paradip Port)లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నౌకాశ్రయంలో లంగరు వేసిన ఓ కార్గో షిప్‌లో రూ.220 కోట్ల విలువ చేసే కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పనామాలో రిజిస్టర్ అయిన ఓ సరకు రవాణా నౌక ఈజిప్టు నుంచి ఇండోనేషియా మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుందని అధికారులు తెలిపారు. పారాదీప్ నుంచి స్టీల్ ప్లేట్లతో నౌక డెన్మార్క్‌కు బయలుదేరాల్సి ఉండగా, ఓడలోని క్రేన్‌లో అనుమానాస్పదంగా ఉన్న 22 ప్యాకెట్లను ఆపరేటర్ గుర్తించి తమకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షల తర్వాత అది కొకైన్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు