Parvatipuram: జగన్ ‘సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

జగన్ ‘సిద్ధం’ సభకు బస్సులు తరలించడం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెట్టాయి.

Updated : 23 Apr 2024 16:17 IST

జగన్ ‘సిద్ధం’ సభకు బస్సులు తరలించడం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సిద్ధం సభకు పార్వతీపురం డిపో నుంచి 60 బస్సులను తరలించారు. ప్రయాణికులకు బస్సులు లేక గంటలు తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వేసవి సెలవులు కావడంతో.. విద్యార్థులు, తమ లగేజీతో సొంతూళ్లకు బయల్దేరారు. అయితే బస్సులు లేక విద్యార్థులు తల్లిదండ్రులు అవస్థలు పడాల్సి వస్తోంది.

Tags :

మరిన్ని