TS News: కాంగ్రెస్‌ జోరు.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నేతల ప్రచారం

తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తోంది.

Published : 21 Apr 2024 09:50 IST

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ (Congress).. సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రాన్ని ఏలిన భారాస ప్రజలకు చేసిందేమీ లేదంటూ జనంలోకి వెళ్తోంది. అత్యధిక ఎంపీలు కాంగ్రెస్‌కు కట్టబెడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ నేతలు, అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.  

Tags :

మరిన్ని