TS News: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేలా కాంగ్రెస్‌ ప్రణాళిక

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సర్వం సిద్ధం చేసుకుంటోంది.

Published : 23 Apr 2024 09:48 IST

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఏఐసీసీ మేనిఫెస్టోతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అమలుచేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బ్రోచర్లు, కరపత్రాలు పెద్ద ఎత్తున పంచేందుకు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల నేతృత్వంలో వీటిని బూత్ స్థాయి, అక్కడి నుంచి ఇంటింటికి అందేలా చూడాలని పీసీసీ నిర్ణయించింది.

Tags :

మరిన్ని