Coromandel Express: పట్టాలెక్కిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. సేవలు షురూ

మూడు రైళ్ల పెను విషాదం అనంతరం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) మళ్లీ పట్టాలెక్కింది. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి రైలు బయలుదేరింది. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రెండు ప్రధాన మార్గాలను రైల్వే సిబ్బంది అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బాలేశ్వర్ మార్గంలో రైళ్లు యధావిధిగానే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి పట్టాలెక్కించారు. 

Updated : 07 Jun 2023 17:16 IST
Tags :

మరిన్ని