Purandeswari: వైకాపా ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు: పురందేశ్వరి
ఏపీలో రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు. ఏలూరు జిల్లా భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో ఆమె పర్యటించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులన్నా.. వ్యవసాయమన్నా చిన్నచూపు ఉందని ఆక్షేపించారు.
Published : 08 Dec 2023 17:44 IST
Tags :