AP News: అంధ, దివ్యాంగుల పాఠశాలను ఆఘమేఘాలపై కూల్చివేసిన అధికారులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 20 ఏళ్లకుపైగా ఒకేచోట నిర్వహిస్తున్న జియాన్ అంధ, దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల తరలింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 7 గంటలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆవరణలోకి వెళ్లి గేట్లు మూసేసి ఆఘమేఘాలపై విద్యార్థులు, సామగ్రిని వాహనాల్లో తరలించారు. షెడ్లు, నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందమందికిపైగా బాలలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. వసతిగృహంలో 45 మంది వరకు ఉంటున్నారు. బడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పెద్దఎత్తున వచ్చిన పోలీసులను చూసి బాలలు భయపడ్డారు. అల్పాహారం చేయనీయకుండా కొట్టి బలవంతంగా వ్యాన్లో ఎక్కించారని కొందరు విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.
Published : 30 Dec 2023 10:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్