Election: ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించవద్దు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రూపంలోనైనా చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టంచేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలపంపిణీ, నినాదాలు చేయడంసహాఎందులోనూ పిల్లలను ప్రచారంలో భాగం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ, అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించుకోవద్దని సూచించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో క్రియాశీల పక్షాలు అన్నీ భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు
Published : 05 Feb 2024 23:02 IST
Tags :