Kadapa: గుక్కెడు నీటి కోసం అవస్థలు పడుతున్న బద్వేల్‌ ప్రజలు

కడప జిల్లా బద్వేల్ పురపాలిక సంఘంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది.

Published : 07 Jun 2024 14:06 IST

కడప జిల్లా బద్వేల్ పురపాలిక సంఘంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో గుక్కెడు నీటి కోసం రేయింబవళ్లు అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోయారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు చీకటిలో పరుగు తీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మం సాగర్ తాగునీటి పథకం కోసం రూ.130 కోట్లను కేటాయిస్తే.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.

Tags :

మరిన్ని