Chittoor: పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లెలోని పంట పొలాలపై ఏనుగుల (Elephant) గుంపు దాడి చేసింది. కోత దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోటను ఏనుగులు నేలమట్టం చేసి, నిరాశ మిగిల్చాయని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వరలక్ష్మి అనే మహిళా రైతు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి పంటను సాగు చేశారు. రెండు, మూడు రోజుల్లో పంటను కోయాల్సి ఉండగా.. ఈలోపే ఏనుగుల గుంపు తోటను ధ్వంసం చేసిందని ఆమె వాపోయారు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు.
Updated : 29 Nov 2023 13:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం