Philippines: ఫిలిప్పీన్స్‌ మత్స్యకారుల బోటులో పేలుడు.. ఆరుగురు మృతి

ఫిలిప్పీన్స్‌లో మత్స్యకారుల బోటులో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందారు.

Updated : 06 Jun 2024 15:16 IST

ఫిలిప్పీన్స్‌ (Philippines)లో మత్స్యకారుల బోటులో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురిని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బోటు ఇంజిన్‌లో మెుదట సమస్య తలెత్తిందని ఆ తర్వాత పేలుడు సంభవించిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు నీటిలోకి దూకగా.. వారిని సమీపంలో ఉన్న మరో బోటులోని వ్యక్తులు రక్షించారు. 

Tags :

మరిన్ని