Siddipet: పెట్రోల్‌లో నీళ్లు కలిపి అమ్ముతున్నారని ప్రజల ఆందోళన

సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లోని ఓ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్  కొట్టించుకుని కొంతదూరం వెళ్లే సరికి వాహనాలు ఆగిపోతున్నాయని ఆరోపించారు. నీళ్లు కలిసిన పెట్రోల్‌ బాటిళ్లను తీసుకువచ్చి బంకువద్ద ఆందోళన చేపట్టారు. బంకుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

Published : 28 Feb 2024 19:29 IST

సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లోని ఓ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్  కొట్టించుకుని కొంతదూరం వెళ్లే సరికి వాహనాలు ఆగిపోతున్నాయని ఆరోపించారు. నీళ్లు కలిసిన పెట్రోల్‌ బాటిళ్లను తీసుకువచ్చి బంకువద్ద ఆందోళన చేపట్టారు. బంకుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

Tags :

మరిన్ని