SangaReddy: పేలిన రియాక్టర్.. ఆర్గానిక్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Published : 03 Apr 2024 20:22 IST
Tags :