Chhattisgarh: వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం.. 4 ఏళ్ల బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘోర భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చింతకుంట బాలికల హాస్టల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెదురు బొంగులతో నిర్మించిన వసతి గృహం పూర్తిగా దగ్ధమైంది. హాస్టల్లో నిద్రిస్తున్న 300 మంది విద్యార్థులను గ్రామస్థులు రక్షించారు. ఘటనలో 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. సకాలంలో గ్రామస్థులు, సిబ్బంది స్పందించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది.
Published : 07 Mar 2024 11:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు