YSRCP: వైకాపా ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా అనుచరుడి నిరసన..!

వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అనుచరుడు హేమచంద్రారెడ్డి శ్రీకాళహస్తి బిక్షాల గాలిగోపురం వద్ద ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. 

Published : 22 Apr 2024 15:14 IST

వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అనుచరుడు హేమచంద్రారెడ్డి శ్రీకాళహస్తి బిక్షాల గాలిగోపురం వద్ద ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని వెండిని.. బెంగళూరులోని ఓ మహిళకు అమ్మేందుకు తన దగ్గరికే పంపారని ఆరోపించారు. ఆ మహిళ నుంచి రూ.10 లక్షల నగదును తానే ఎమ్మెల్యేకి చేరవేసినట్టు హేమచంద్ర రెడ్డి తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఎమ్మెల్యే కబ్జా చేసిన డీకేటీ భూముల వివరాలను సైతం త్వరలోనే వెల్లడిస్తానన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తనకు ఎలాంటి హాని ఎదురైనా.. అది మధుసూదన్ రెడ్డి వల్లే జరుగుతుందని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. 

Tags :

మరిన్ని