Duvvada: రైలు, ప్లాట్‌ఫామ్‌కి మధ్య చిక్కుకున్న విద్యార్థిని.. గంటన్నరపాటు నరకయాతన

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. అన్నవరానికి చెందిన శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది. 

Updated : 07 Dec 2022 10:47 IST

Duvvada: రైలు, ప్లాట్‌ఫామ్‌కి మధ్య చిక్కుకున్న విద్యార్థిని.. గంటన్నరపాటు నరకయాతన

Tags :

మరిన్ని