Andhra News: విజయవాడ-మంగళగిరి మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్‌

మంగళగిరి: విజయవాడ-మంగళగిరి మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. కడప పర్యటనకు వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్‌ బయల్దేరడంతో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గం కాకపోయినా వాహనాలను నిలిపేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పోలీసుల తీరుపై సామాన్యులు మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చిక్కుకున్నారు. వాహనాలను పోలీసులు ఎక్కువ సేపు నిలిపివేయడంతో ఆయన నడుచుకుంటూ తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు.

Published : 06 Dec 2022 12:19 IST

మంగళగిరి: విజయవాడ-మంగళగిరి మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. కడప పర్యటనకు వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్‌ బయల్దేరడంతో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గం కాకపోయినా వాహనాలను నిలిపేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పోలీసుల తీరుపై సామాన్యులు మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చిక్కుకున్నారు. వాహనాలను పోలీసులు ఎక్కువ సేపు నిలిపివేయడంతో ఆయన నడుచుకుంటూ తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు.

Tags :

మరిన్ని