NTR Dist: మిగ్‌జాం తుపాను బీభత్సం.. కూచివాగుకు పోటెత్తిన వరద

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలంలోని కూచివాగుకు వరద పోటెత్తింది. పెనుగంచిప్రోలు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. కోసి కుప్పలు పోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం రాశులు నీటిలో తేలియాడుతున్నాయి. అవకాశం ఉన్న మేరకు రైతులు  పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 06 Dec 2023 11:07 IST

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలంలోని కూచివాగుకు వరద పోటెత్తింది. పెనుగంచిప్రోలు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. కోసి కుప్పలు పోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం రాశులు నీటిలో తేలియాడుతున్నాయి. అవకాశం ఉన్న మేరకు రైతులు  పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

మరిన్ని