చైనాకు దీటుగా భారత్‌ రాకెట్ ఫోర్స్.. 120 ప్రళయ్‌ క్షిపణుల కొనుగోలుకు అనుమతి

చైనాకు దీటుగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసే.. 100కిపైగా ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. చైనాలోని అన్ని ప్రధాన నగరాలపై గురిపెట్టేలా అగ్ని-5 క్షిపణి రేంజిని 5 వేల కిలోమీటర్ల నుంచి 7 వేల కిలోమీటర్లకు పెంచింది. శత్రు దేశాల గగనతల దాడుల నుంచి రక్షించుకునేందుకు S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి వేగంగా సమకూర్చుకుంటోంది. ఈ క్షిపణి వ్యవస్థ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్‌కు చేరనుంది.

Published : 26 Dec 2022 15:18 IST

Tags :

మరిన్ని