Ap News: ఐదేళ్లు వైకాపా బంటుల్లా కొందరు ఐపీఎస్‌ అధికారులు..!

రాష్ట్రంలో కొంతమంది ఐపీఎస్‌ అధికారులు గత ఐదేళ్లలో పేట్రేగిపోయారు. అఖిల భారత సర్వీసు అధికారులమనే సంగతే మరిచిపోయి.. వైకాపా బంటుల్లా, జగన్‌ భక్తుల్లా పనిచేశారు.

Published : 07 Jun 2024 13:05 IST

రాష్ట్రంలో కొంతమంది ఐపీఎస్‌ అధికారులు గత ఐదేళ్లలో పేట్రేగిపోయారు. అఖిల భారత సర్వీసు అధికారులమనే సంగతే మరిచిపోయి.. వైకాపా బంటుల్లా, జగన్‌ భక్తుల్లా పనిచేశారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాస్తూ.. ప్రతిపక్షాలను అణచివేశారు. అక్రమ కేసులతో వేధించారు. బాధితులపైనే రివర్స్‌లో కేసులు పెట్టారు. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిబంధనలు, చట్టాలను లెక్క చేయకుండా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా ఓటమి పాలై... తెదేపా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో తమను పనిగట్టుకుని వేధించిన ఐపీఎస్‌ అధికారులపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు