Japan Earthquake: జపాన్‌లో భూకంపం.. వంద మందికిపైగా మృతి!

జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి చనిపోయినవారి సంఖ్య వందకు పెరిగింది. కొత్త సంవత్సరం మొదటిరోజే రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వందల సంఖ్యలో భవనాలు పేకమేడలా కూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని 72గం. తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. 

Published : 06 Jan 2024 15:28 IST

జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి చనిపోయినవారి సంఖ్య వందకు పెరిగింది. కొత్త సంవత్సరం మొదటిరోజే రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వందల సంఖ్యలో భవనాలు పేకమేడలా కూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని 72గం. తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. 

Tags :

మరిన్ని