Vijayawada: వైకాపా ప్రభుత్వ విధానాలతో రోడ్డునపడ్డ లారీ బాడీ బిల్డింగ్‌ కార్మికులు

వైకాపా ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉపాధి అవకాశాలు లేక.. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని లారీ కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం మారితేనే తమ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published : 22 Apr 2024 19:35 IST

ఆసియా ఖండంలోనే పారిశ్రామికవాడల్లో విజయవాడ ఆటోనగర్ అతి పెద్దది. ఇక్కడ కార్మికుల ప్రధాన జీవనాధారాల్లో లారీ బాడీ బిల్డింగ్ ఒకటి. తెదేపా హయాంలో బాడీ బిల్డింగ్ పనులు, కార్మికులతో ఆటోనగర్ కళకళలాడేది. ప్రస్తుతం వాహనాల ఉత్పత్తిలో వచ్చిన మార్పులు, వైకాపా ప్రభుత్వ విచ్చలవిడి పన్నుల మోతతో లారీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉపాధి అవకాశాలు లేక.. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం మారితేనే తమ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని