T Congress: అధ్యయనం మొదలుపెట్టిన ఠాక్రే.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం మొదలుపెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన ఆయనకు మొదట శంషాబాద్  విమానాశ్రయంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. తర్వాత గాంధీభవన్‌కు చేరుకున్న ఠాక్రే కాంగ్రెస్ నాయకులతో వరుస భేటీలు జరిపారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీల పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలతో భేటీ కానున్న ఠాక్రే.. సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు. 

Published : 11 Jan 2023 21:56 IST

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం మొదలుపెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన ఆయనకు మొదట శంషాబాద్  విమానాశ్రయంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. తర్వాత గాంధీభవన్‌కు చేరుకున్న ఠాక్రే కాంగ్రెస్ నాయకులతో వరుస భేటీలు జరిపారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీల పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలతో భేటీ కానున్న ఠాక్రే.. సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు