Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది: కిషన్‌రెడ్డి

ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Published : 18 May 2024 17:43 IST

ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికపై.. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే ఉన్నందున గ్రామాల్లోని పట్టుభద్రులని కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. వారిని ఒప్పించి భాజపాకు ఓటుపడేలా చూడాలని శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Tags :

మరిన్ని