Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల కేసులో ఐటీ విచారణకు సిద్ధం

తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితోపాటు మరో 15 మందిని ఇవాళ్టి నుంచి ఐటీ అధికారులు విచారించనున్నారు. ఈ ప్రక్రియ మూడు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సమన్లు అందుకున్నవారు.. వారికి నిర్దేశించిన తేదీల్లో ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఆయా వ్యక్తులకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్ , ఐటీ రిటర్న్‌లను స్వాధీనం చేసుకున్న ఆస్తులతో కలిపి వివరణ కోరేందుకు ఐటీ అధికారులు సిద్ధమయ్యారు.

Updated : 28 Nov 2022 09:35 IST

Tags :

మరిన్ని