Ponnam: నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించిన భాజపా: మంత్రి పొన్నం ప్రభాకర్‌

రూ.వేల కోట్ల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి భాజపా (BJP) రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. హనుమకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శరత్‌చంద్రారెడ్డి రూ.500 కోట్లు బాండ్ల రూపంలో విరాళంగా ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు తప్పుపట్టినప్పటికీ ప్రధాని సమర్థించడం సరికాదన్నారు. 

Published : 17 Apr 2024 17:17 IST

రూ.వేల కోట్ల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి భాజపా (BJP) రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. హనుమకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శరత్‌చంద్రారెడ్డి రూ.500 కోట్లు బాండ్ల రూపంలో విరాళంగా ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు తప్పుపట్టినప్పటికీ ప్రధాని సమర్థించడం సరికాదన్నారు. 

Tags :

మరిన్ని