Phone Tapping Case: టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును అరెస్టు చేసి విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. గత నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్లో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

Published : 30 Mar 2024 10:00 IST

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును అరెస్టు చేసి విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. గత నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్లో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

Tags :

మరిన్ని