AP News: గులకరాయి కేసులో విచారణ అధోగతి

సీఎం జగన్‌పై గులక రాయితో దాడి ఘటన జరిగి తొమ్మిది రోజులైనా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఎనిమిది బృందాలతో కూడిన ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసినా, సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించినా లాభం కనిపించడం లేదు.

Updated : 22 Apr 2024 09:41 IST

సీఎం జగన్‌పై గులక రాయితో దాడి ఘటన జరిగి తొమ్మిది రోజులైనా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఎనిమిది బృందాలతో కూడిన ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసినా, సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించినా లాభం కనిపించడం లేదు. తెదేపా నాయకుడు దుర్గారావును నాలుగు రోజులపాటు అదుపులో ఉంచుకుని ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు లభ్యం కాలేదు. ఇప్పటి వరకు ఏ1 సంగతి మాత్రమే పోలీసులు తేల్చారు. మరి మిగిలిన నిందితులు ఎవరు.. వారి పాత్ర ఏమిటి? అనే అంశాలను వెలికి తీయలేకపోయారు.

Tags :

మరిన్ని