Nalgonda: పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్‌.. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

రైలు పట్టాల మధ్య ట్రాక్టర్‌ ఇరుక్కపోవడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎంత ప్రయత్నించినా ట్రాక్టర్‌ బయటకు రాకపోవడంతో స్థానికులు 100కు సమాచారం అందించారు. దీంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వే స్టేషన్‌లోనే అధికారులు నిలిపివేశారు. ఎట్టకేలకు జేసీబీ సహాయంతో అతికష్టం మీద ట్రాక్టర్‌ను బయటకు తీయడంతో.. అర్ధగంట తర్వాత రైలు ముందుకు కదిలింది.

Updated : 27 Oct 2023 13:45 IST

రైలు పట్టాల మధ్య ట్రాక్టర్‌ ఇరుక్కపోవడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎంత ప్రయత్నించినా ట్రాక్టర్‌ బయటకు రాకపోవడంతో స్థానికులు 100కు సమాచారం అందించారు. దీంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వే స్టేషన్‌లోనే అధికారులు నిలిపివేశారు. ఎట్టకేలకు జేసీబీ సహాయంతో అతికష్టం మీద ట్రాక్టర్‌ను బయటకు తీయడంతో.. అర్ధగంట తర్వాత రైలు ముందుకు కదిలింది.

Tags :

మరిన్ని