AP News: ఎండలు ఠారెత్తిస్తున్న వేళ.. తిరువూరులో దాహం కేకలు

వైకాపా ప్రజాప్రతినిధుల అసమర్థపాలనతో నడి వేసవిలో తాగునీటి కోసం తిరువూరు ప్రజలు అల్లాడిపోతున్నారు.

Published : 24 Apr 2024 18:49 IST

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్న వేళ.. పట్టణాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యం పంపిణీ చేయాల్సిన తాగునీటిని రెండు, మూడు రోజులకొకసారి విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా పాతకాలంనాటి తాగునీటి పథకాల సామర్థ్యం చాలడం లేదు. కొత్త పథకం ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు నిలిచిపోయాయి. వైకాపా ప్రజాప్రతినిధుల అసమర్థపాలనతో నడి వేసవిలో తాగునీటి కోసం తిరువూరు ప్రజలు అల్లాడిపోతున్నారు.

Tags :

మరిన్ని