CM Jagan: సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు.. భారీగా పోలీసుల మోహరింపు
వాల్మీకి, బోయ, బెంతు ఒరియా కులాలను ఎస్టీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. భారీగా బలగాలను సీఎం నివాసం చుట్టూ మోహరించారు. జగన్ నివాసానికి వెళ్లే మార్గాలైన తాడేపల్లి పశు వైద్యశాల, ఎన్టీఆర్ కట్ట, పాత టోల్గేట్ కూడలి, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Published : 28 Nov 2022 09:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!