BJP - Congress: ‘దమ్ముంటే టచ్‌ చేసి చూడు’.. మహేశ్వర్‌ రెడ్డి, మంత్రి పొన్నం మాటల యుద్ధం

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు భారాస కీలక నేతలు కారు దిగి.. చేతిలో చెయ్యేస్తున్నారు. అటు కమలం నేతలు కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి.. భాజపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఒకరిని ముట్టుకున్నా 48గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్  ఎదురుదాడి చేశారు. భాజపా నేతలకు దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.

Published : 30 Mar 2024 16:46 IST

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు భారాస కీలక నేతలు కారు దిగి.. చేతిలో చెయ్యేస్తున్నారు. అటు కమలం నేతలు కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి.. భాజపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఒకరిని ముట్టుకున్నా 48గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్  ఎదురుదాడి చేశారు. భాజపా నేతలకు దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.

Tags :

మరిన్ని