Ramoji Rao: రామోజీరావు మృతి.. కీరవాణి, రాజమౌళి భావోద్వేగం

రామోజీరావు పార్థివదేహానికి సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళి నివాళి అర్పించారు.

Updated : 08 Jun 2024 15:08 IST

ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం రామోజీరావుకే సాధ్యమైందని దర్శకుడు రాజమౌళి అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచి, మరెంతో మందికి ఉపాధి కల్పించారని రాజమౌళి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 

Tags :

మరిన్ని