Kidnap: భూమి చూపించాలని తీసుకెళ్లి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఆపై!

సత్యసాయి జిల్లా హిందూపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైకాపాకు చెందిన బాబురెడ్డి అనే వ్యక్తి.. శివలింగప్ప అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం భూమి చూపించాలంటూ.. కర్ణాటకలోని బైచాపురం తీసుకువెళ్లి తోటలో బంధించి డబ్బులు డిమాండ్  చేశాడు. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలియజేశాడు. ఘటనపై హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Published : 19 Mar 2023 19:24 IST
Tags :

మరిన్ని