Vizag: విశాఖ ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Published : 12 May 2024 13:14 IST

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి వంతెనపై రక్షణ గోడను ఢీకొంది. దీంతో డ్యూక్‌ బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు వంతెనపై నుంచి కిందపడ్డారు. ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఎయిర్‌పోర్ట్‌ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని