Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.

Updated : 27 May 2024 13:35 IST

ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, ఆయన భార్య జయంతి, వారి బంధువు పద్మమ్మతోపాటు కారు డ్రైవర్ సమీర్ మృతి చెందారు.

Tags :

మరిన్ని