CM Jagan: సీఎం జగన్ సభకు ఆర్టీసీ బస్సులు.. సామాన్య ప్రజలకు అవస్థలు
సీఎం జగన్ పర్యటన అంటే చాలు సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సీఎం సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను భారీగా తరలించడంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఎండవేడిమి, ఉక్కపోత తాళలేక ఆపసోపాలు పడుతున్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిన పలు బస్సులను సైతం నిలిపివేయడంతో బస్టాండుల్లో వేచిచూడాల్సిన దుస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 16 Apr 2024 15:21 IST
Tags :