Vizag: సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమ బస్సు కలకలం

కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమ బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. అందులో అట్టపెట్టెలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో తనిఖీ చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 25 Mar 2024 09:21 IST

కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమ బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. అందులో అట్టపెట్టెలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో తనిఖీ చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని