Chittoor Dist: నిధుల కోసం గ్రామంలో భిక్షాటన చేసిన సర్పంచ్ దంపతులు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం శెట్టిపల్లె గ్రామ పంచాయతీలో నిధుల కోసం సర్పంచ్ దంపతులు భిక్షమెత్తారు. సర్పంచ్ రీటా, ఎల్లప్ప దంపతులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ గ్రామంలో భిక్షాటన చేశారు. తెలుగుదేశం తరఫున గెలవడం వల్లే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. జగన్ ప్రభుత్వం సర్పంచ్‌లపై కక్ష సాధించడంతో పాటు నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం భిక్షాటన చేయాల్సి వస్తోందన్నారు.

Updated : 29 Nov 2023 14:07 IST

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం శెట్టిపల్లె గ్రామ పంచాయతీలో నిధుల కోసం సర్పంచ్ దంపతులు భిక్షమెత్తారు. సర్పంచ్ రీటా, ఎల్లప్ప దంపతులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ గ్రామంలో భిక్షాటన చేశారు. తెలుగుదేశం తరఫున గెలవడం వల్లే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. జగన్ ప్రభుత్వం సర్పంచ్‌లపై కక్ష సాధించడంతో పాటు నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం భిక్షాటన చేయాల్సి వస్తోందన్నారు.

Tags :

మరిన్ని