Secunderabad: భోజనంలో బొద్దింక వచ్చిందని.. పీజీ కళాశాల విద్యార్థుల ఆందోళన
సికింద్రాబాద్ పీజీ కళాశాల వసతి గృహం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. గురువారం రాత్రి భోజనంలో బొద్దింకలు రావడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. వంట సామాగ్రితో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. గతంలో పలుమార్లు తినే ఆహారంలో పురుగులు, రాళ్లు రావడంతో కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Published : 29 Mar 2024 12:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి