Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Published : 18 May 2024 15:44 IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తెలంగాణ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ‘ఇన్ఫోసిస్‌’ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి, భాజపా నేత విశ్వేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వీరికి అందజేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు