Bhuvanagiri: పట్టపగలే ద్విచక్రవాహనం బ్యాగులోని నగదు దొంగతనం.. సీసీఫుటేజ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న ఓ ద్విచక్రవాహనం బ్యాగులోని నగదును దుండగులు దోచుకెళ్లారు. బీబీనగర్ మండలం, రావి పహాడ్‌కి చెందిన వెంకటేశ్ బ్యాంకు నుంచి రూ.1.86 లక్షలు తీసుకొని.. బైక్ బ్యాగులో దాచి, సమీపంలోని పశువుల మందుల దుకాణానికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత దుకాణం నుంచి బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 06 Dec 2023 12:40 IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న ఓ ద్విచక్రవాహనం బ్యాగులోని నగదును దుండగులు దోచుకెళ్లారు. బీబీనగర్ మండలం, రావి పహాడ్‌కి చెందిన వెంకటేశ్ బ్యాంకు నుంచి రూ.1.86 లక్షలు తీసుకొని.. బైక్ బ్యాగులో దాచి, సమీపంలోని పశువుల మందుల దుకాణానికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత దుకాణం నుంచి బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని