Lok Sabha Polls: ఉత్తర బెంగళూరులో రసవత్తర పోరు

కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది.  ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరఫున కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, కాంగ్రెస్‌ నుంచి రాజీవ్‌గౌడ హోరాహోరీగా తలపడుతున్నారు.

Published : 22 Apr 2024 12:47 IST

కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. 1952 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండగా 2004 నుంచి ఇది భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరింది. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరఫున కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, కాంగ్రెస్‌ నుంచి రాజీవ్‌గౌడ హోరాహోరీగా తలపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ శోభా కరంద్లాజే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కారు అమలు చేస్తున్న 5 గ్యారంటీలు తన విజయానికి దోహదం చేస్తాయని రాజీవ్‌గౌడ నమ్మకంతో ఉన్నారు.

Tags :

మరిన్ని