Mahabubabad: బావి తవ్వుతుండగా మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు
వ్యవసాయ బావి తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు మట్టిలో చిక్కుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. సుధాకర్ అనే రైతు తను సాగు చేసే భూమిలో జేసీబీతో వ్యవసాయ బావిని తవ్విస్తుండగా అడుగున రాయి వచ్చింది. రాయిని పరిశీలించేందుకు సుధాకర్, కూలీ నరేశ్ బావి లోకి దిగారు. అదే సమయంలో మట్టి కూలడంతో వారు సగం వరకు కూరుకుపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జేసీబీ సహాయంతో 2 గంటల పాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు.
Published : 03 Apr 2024 11:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం