Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌పై రష్యా భీకర దాడులు.. చెలరేగిన మంటలు

ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన ఖేర్సన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్నట్లు స్థానిక గవర్నర్  తెలిపారు.

Published : 06 Jun 2024 17:24 IST

ఉక్రెయిన్‌ (Ukraine)లోని ప్రధాన నగరమైన ఖేర్సన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్నట్లు స్థానిక గవర్నర్  తెలిపారు. తాజాగా ఐదు ప్రాంతాల్లో  దాడులకు పాల్పడినట్లు.. సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. మాస్కో దాడులతో నివాస సముదాయాలు, మార్కెట్లు, పార్కింగ్ స్థలాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. పుతిన్ సేనలు జరిపిన దాడులతో స్థానికంగా ఉన్న హైపర్ మాల్‌లో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగినట్లు.. ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగం అధికారుల తెలిపారు. 

Tags :

మరిన్ని