AP News: ఇళ్లకు అధిక కరెంటు ఇవ్వడానికి సేద్యానికి కోత ఎండుతున్న పంటలు
ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం జగన్ ఆలోచన. మరోవైపు... పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ను కొనాలన్నా మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. గత రెండేళ్లుగా వేసవిలో విద్యుత్ కోతలతో ప్రజలకు జగన్ ప్రభుత్వం చుక్కల్నే చూపించింది. ఈ ఏడాదీ కోతలు కొనసాగిస్తే ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందన్న భయం పట్టుకుంది. దీంతో వ్యవసాయ విద్యుత్ను గృహ వినియోగదారులకు మళ్లించింది. అసలే... వర్షాభావ పరిస్థితులతో పంటలు కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్న రైతులకు దిక్కుతోచడంలేదు.
Published : 28 Mar 2024 12:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు