Crime News: పలువురి కళ్లుగప్పి రూ.10 లక్షల నెక్లెస్‌ ఎలా కొట్టేసిందో చూడండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్‌పుర్‌ జాతేపుర్‌ ప్రాంతంలోని బల్‌దేవ్‌ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబరు 17న ఈ ఘటన జరిగింది. ఇది సిబ్బంది పనే అని తొలుత భావించగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ.. సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్‌లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగిలించింది. మిగిలినవి తనకు నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ చోరీపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 26 Nov 2022 14:06 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్‌పుర్‌ జాతేపుర్‌ ప్రాంతంలోని బల్‌దేవ్‌ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబరు 17న ఈ ఘటన జరిగింది. ఇది సిబ్బంది పనే అని తొలుత భావించగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ.. సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్‌లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగిలించింది. మిగిలినవి తనకు నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ చోరీపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని