TS News: రాష్ట్రంలో అకాల వర్షం.. పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి

అకాల వర్షం జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన భారీవర్షానికి పెద్దఎత్తున పంటలు దెబ్బతినగా కల్లాల్లో, మార్కెట్ లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని మిగిల్చింది.

Published : 17 May 2024 12:37 IST

అకాల వర్షం జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన భారీవర్షానికి పెద్దఎత్తున పంటలు దెబ్బతినగా కల్లాల్లో, మార్కెట్ లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని మిగిల్చింది.

Tags :

మరిన్ని